|
|
Navakavitha Jaldhi Dasarathi Book Released నవకవితా జలధి దాశరథి పుస్తకావిష్కరణ |
|
||||
నవకవితా జలధి-దాశరథి పుస్తకావిష్కరణ
2 జూలై 2011న శ్రీ త్యాగరాయగానసభలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ డాక్టర్ ద్వానాశాస్త్రి రచించిన ‘నవకవితా జలధి-దాశరథి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభకు సుప్రసిద్ధ కవి, శతావధాని డా.రాళ్లబండి కవితాప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సభకి కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు మద్దాలి రఘురామ్ గారు స్వాగతం పలికారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.వి.రమణ ఈ పుస్తకాని ఆవిష్కరించి ప్రసంగిస్తూ మహాకవి దాశరథి, భావకవి, అభ్యుదయకవి, ఉద్యమకవి ఆధ్యాత్మిక కవి అని అన్నారు. దాశరథి ఎన్నో కోణాలలో కవిత్వాన్ని సామాన్యుడుకి సైతం అర్థం మైనరీతిలో వ్రాసి జనరంజకం చేసి భావితరాల కవులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ‘నవకవితా జలధి-దాశరథి’ గ్రంథ రచయిత డా. ద్వానాశాస్త్రి ఈ పుస్తకంలో దాశరథి జీవిత, సాహితీ విశేషాలను విన్నూత్న కోణంలో రాసారని అన్నారు.
అధ్యక్షత వహించిన డా. రాళ్లబండి కవితాప్రసాద్ దాశరథి గారి సాహిత్యం వంశ పారంపర్యంగా వచ్చిందని దానిని ఆయన ఉద్యమంగా నడిపించారని అన్నారు. ఈ సభలో విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రసార భారతి దూరదర్శన్ హైదరాబాద్ పూర్వపు డైరెక్టర్ డా.మధుసూదన్ రావు గారు తాను పనిచేసిన ఆకాశవాణిలో కవిసమ్మేళనాల నాటి దాశరథి పరిచయాన్ని, ఆత్మీయతని వివరించారు.
ఈ సభలో డా.ద్వానాశాస్త్రి తన కృతిని శ్రీమతి దాశరథి లక్ష్మి గారికి అంకితం చేశారు. ఈ గ్రంథావిష్కరణ అనంతరం తన స్పందనలో డా.ద్వానాశాస్త్రి ఈ పుస్తకం తనని రాయమని సి.పి. బ్రాన్ అకాడమీ కోరినప్పుడు ఇంత గురుతర భాద్యతను ఎలా నిర్వహించాగలను? అని ఆవేదన చెందానని, అయితే దాశరథి గారిపై అంతకుముందు రాసిన పరిశోధన పుస్తకాలని అధ్యయనం చేసి ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నవకవితా జలధి-దాశరథి గ్రంథాని రాసానని అన్నారు.
2 జూలై 2011న శ్రీ త్యాగరాయగానసభలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ డాక్టర్ ద్వానాశాస్త్రి రచించిన ‘నవకవితా జలధి-దాశరథి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభకు సుప్రసిద్ధ కవి, శతావధాని డా.రాళ్లబండి కవితాప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సభకి కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు మద్దాలి రఘురామ్ గారు స్వాగతం పలికారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.వి.రమణ ఈ పుస్తకాని ఆవిష్కరించి ప్రసంగిస్తూ మహాకవి దాశరథి, భావకవి, అభ్యుదయకవి, ఉద్యమకవి ఆధ్యాత్మిక కవి అని అన్నారు. దాశరథి ఎన్నో కోణాలలో కవిత్వాన్ని సామాన్యుడుకి సైతం అర్థం మైనరీతిలో వ్రాసి జనరంజకం చేసి భావితరాల కవులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ‘నవకవితా జలధి-దాశరథి’ గ్రంథ రచయిత డా. ద్వానాశాస్త్రి ఈ పుస్తకంలో దాశరథి జీవిత, సాహితీ విశేషాలను విన్నూత్న కోణంలో రాసారని అన్నారు.
అధ్యక్షత వహించిన డా. రాళ్లబండి కవితాప్రసాద్ దాశరథి గారి సాహిత్యం వంశ పారంపర్యంగా వచ్చిందని దానిని ఆయన ఉద్యమంగా నడిపించారని అన్నారు. ఈ సభలో విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రసార భారతి దూరదర్శన్ హైదరాబాద్ పూర్వపు డైరెక్టర్ డా.మధుసూదన్ రావు గారు తాను పనిచేసిన ఆకాశవాణిలో కవిసమ్మేళనాల నాటి దాశరథి పరిచయాన్ని, ఆత్మీయతని వివరించారు.
ఈ సభలో డా.ద్వానాశాస్త్రి తన కృతిని శ్రీమతి దాశరథి లక్ష్మి గారికి అంకితం చేశారు. ఈ గ్రంథావిష్కరణ అనంతరం తన స్పందనలో డా.ద్వానాశాస్త్రి ఈ పుస్తకం తనని రాయమని సి.పి. బ్రాన్ అకాడమీ కోరినప్పుడు ఇంత గురుతర భాద్యతను ఎలా నిర్వహించాగలను? అని ఆవేదన చెందానని, అయితే దాశరథి గారిపై అంతకుముందు రాసిన పరిశోధన పుస్తకాలని అధ్యయనం చేసి ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నవకవితా జలధి-దాశరథి గ్రంథాని రాసానని అన్నారు.
|
||||
|
||||
|
||||
No videos







Dr KV Ramana Felicitating Dwana Sastry in Dasarathi Book Released Funtion
Sri M Raghuram Dr R Kavithaprasad Dr KV Ramana Dr Madhusudhan Rao
Sri M Raghuram Dr R Kavithaprasad Dr KV Ramana Dr Madhusudhan Rao Dwana Sastry
Navakavitha Jaldhi Dasarathi Book Released Invitation
Dwana Sastry Dedicating Book to Miss Dasarathi Laxmi






















